టిటిడి 2020 క్యాలెండర్లను ఆవిష్కరించిన ఛైర్మన్ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్ధానం ఏటా రూపొందించిన 2020 క్యాలెండర్లను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ రూ.100/- విలువగల 12 పేజీల క్యాలెండర్లు 12 లక్షలు, రూ.15/- విలువగల శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.50 లక్షలు, రూ.15/- విలువగల శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, రూ.10/- విలువగల శ్రీవారు మరియు శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, అదేవిధంగా రూ.20/- విలువగల తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2 లక్షలు, రూ.60/- విలువగల టేబుల్ టాప్ క్యాలెండర్లు 75 వేలు ముద్రించామని వివరించారు. వీటితోపాటు రూ.130/- విలువగల పెద్ద డైరీలు 6 లక్షలు, రూ.100/- విలువగల చిన్నడైరీలు 1.50 లక్షలు ఉన్నాయని తెలిపారు.
డిసెంబరు మొదటి వారం నుండి తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, న్యూఢిల్లీ, ముంబయిలోని టిటిడి సమాచార కేంద్రాల్లో, టిటిడి కల్యాణ మండపాల్లో క్యాలెండర్లు అందుబాటులో ఉంటాయని ఛైర్మన్ తెలిపారు. డిసెంబరు రెండో వారం నుండి డైరీలను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రత్యేక చిరునామాలతో సంస్ధలు టిటిడి డైరీలు కావాలంటే ముందుగా సంప్రదించాలని సూచించారాయన.
డిసెంబరు మొదటి వారం నుండి తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, న్యూఢిల్లీ, ముంబయిలోని టిటిడి సమాచార కేంద్రాల్లో, టిటిడి కల్యాణ మండపాల్లో క్యాలెండర్లు అందుబాటులో ఉంటాయని ఛైర్మన్ తెలిపారు. డిసెంబరు రెండో వారం నుండి డైరీలను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రత్యేక చిరునామాలతో సంస్ధలు టిటిడి డైరీలు కావాలంటే ముందుగా సంప్రదించాలని సూచించారాయన.