ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో తిరుపతిలో అన్నమయ్య సంకీర్తనలు

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో అన్నమయ్య సంకీర్తనల అఖండ మహాయజ్ఞం కార్యక్రమం నిర్వహించనున్నట్టు టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య భమిడిపాటి విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఫిబ్రవరి 24న సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి పరిపాలనా భవనం నుండి అన్నమయ్య ఉత్సవ విగ్రహం ఊరేగింపు మొదలవుతుంది. కళాకారులు సంకీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయ మాడ వీధుల గుండా అన్నమాచార్య కళామందిరానికి తీసుకెళతారు. సాయంత్రం 6 గంటల నుండి మరుసటిరోజైన మంగళవారం సాయంత్రం వరకు 24 గంటల పాటు నిరంతరాయంగా కళాకారులు సంకీర్తనలను ఆలపిస్తారు.