ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో దేశ వ్యాప్తంగా జాతీయ బ్యాంకుల సమ్మె

రేపటి నుంచి రెండు రోజుల పాటు జాతీయ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. ఉద్యోగుల సమ్మెతో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూత పడనున్నాయి. బ్యాంకు ఉద్యోగుల వేతనాలు 20శాతం పెంచాలని ప్రధాన కార్మిక కమిషనర్తో యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంక్ యూనియన్స్ నాయకులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో (శుక్రవారం, శనివారం) దేశ వ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.