‘దిశ’ ఘటనను కాన్సెప్ట్గా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు దిశ ఘటనని ఆలంబనగా చేసుకుని ఓ సినిమా రడీ చేస్తున్నాడు. ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టంపైనా ఇందులో చర్చించేందుకు సిద్దమవుతు, ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ లీడర్, ఓ పోలీసు పాత్రని సిద్దం చేసినట్టు సమాచారం.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని, ఈ క్రమంలోనే దిశ కేసులో నిందితుడైన చెన్నకేశవులు భార్యను రాంగోపాల్ వర్మ కొన్ని రోజుల క్రితమే కలిసి ఆతని నేపథ్యం తెలుసుకున్నారని, అలాగే ఈ కేసుకు సంబంధించి అసలు పోలీసుల ఏం చేసారు, ఎన్కౌంటర్కి సంబంధించిన వివరాలను శంషాబాద్ ఏసిపిని కలసి తెలుసుకున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించి బాధితుల కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసు కోవాల్సిన అవసరం లేదని, సమాజంలో జరిగే ఏ ఘటననైనా సినిమా తీసేందుకు తనకు స్వేచ్ఛ ఉందని రామ్ గోపాల్ వర్మ వెల్లడించడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన దిశ ఘటన, ఆపై నిందితులను కాల్చి చంపిన ఘటన తెలుగు ప్రజల కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వైసిపి సర్కారు 21 రోజులలో శిక్ష అంటూ తీసుకువచ్చిన దిశ చట్టాన్ని కూడా తన సినిమా కోసం వాడేసుకునేలా ‘దిశ’ ఘటనను కాన్సెప్ట్గా ఎంచుకున్నారని సమాచారం. మరి వర్మ ఈ సినిమా ఎలాంటి వివాదాలూ లేకుండా తీస్తారో? లఏదో చూడాలి.