అమరావతి రాజధాని గా అంగీకరించలేని సిఎం జగన్….

అమరావతి రాజధాని గా అంగీకరించలేని సిఎం జగన్ మూడు రాజధానులంటూ డ్రామాలాడుతున్నారని, దీనిని వ్యతిరేకిస్తు విపక్షాలు, రైతులు చేస్తున్న ఉద్యమం రాష్ట్రం నలుదిశలా పాకిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. శనివారం ఆయన అమరావతిలో మీడియాలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా రాజధాని హైదరాబాద్ కోల్పోయామని.. అలాంటి పరిస్థితి రాకూడదనే చంద్రబాబు అమరావతిని రాజధానిగా నిర్ణయించి అభివృద్ధి దిశగా పయనిస్తున్న తరుణంలో రాష్ట్రంలో దురదృష్టవశాత్తు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం అమరావతి, పోలవరం లలో ఎలాంటి పనులు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని, ప్రస్తుతం జనంలో హోదా, రాజధానుల విషయంలో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి తప్పించుకునేం దుకు జనం మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించి గందరగోళ పరిస్థితులు తెచ్చిపెట్టారని జయదేవ్ మండిపడ్డారు.