టీడీపీ శ్రేణులు చేసిన పోస్ట్ పై వైసీపీ నేతల మంట …

సామాజిక మీడియా రాజకీయ నేతలు సెటైర్లు వేసుకునేందుకు ఎంత ఉపయోగ పడుతోందో తాఆగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా పోస్ట్ చూస్తే అర్ధమవుతుంది. అసెంబ్లీలో, మండలిలో, ప్రెస్ మీట్లలో తాము ప్రజా ప్రతినిధులమని మరచి నోటికి ఎంత వస్తే అంత భాష మాట్లాడటం, అందునా అధికార పెద్దలు బూతుల పంచాంగం విప్పడం ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్కు అవకాశాలు కల్పిస్తోంది.
ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే రోజా, మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్లు అడ్డు అదుపూ లేకుండా మాట్లాడేస్తున్నారన్న అపవాదును మూటగట్టుకున్నారు. వారి ప్రవర్తన కూడా అలానే ఉండటంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ఈ ముగ్గురికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చిందని మరోటాక్. దీనినే దృష్టిలో పెట్టుకుని బుచ్చయ్య సోషల్ మీడియాలో తనదైన చమత్కారంతో ఆసక్తికరంగా పోస్ట్ చేశారు.
దీని ప్రకారం వైసిపి అధికారంలోకి రాగానే అశ్లీల భాష మాద్యమంలో తాడేపల్లిలో ఒ పాఠశాల ఉందని.. ఇందులో షార్ట్ టర్మ్ కోర్సు అందుపాటులో ఉందని, సీఎం వైఎస్ జగన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యే రోజా, పృథ్వీలు ప్రస్తావన తెస్తూ తనదైన శైలిలో పంచ్లతో, . ‘సాక్షి’ మీడియాలో దీనికి సంబంధించిన ఆన్లైన్ కో్ర్స్ సదుపాయం కూడా ఉందని చమత్కారంతో బుచ్చయ్య పోస్ట్లు రాసుకొచ్చారు. ఆయన పోస్టు ఇలా ఉంది.
అశ్లీల భాష యొక్క పాఠశాల (షార్ట్ టర్మ్ కోర్సు) : తాడేపల్లి
డీన్ – సీయం జగన్ గారు (అన్ని విభాగాల్లో నైపుణ్యం ఈయన సొంతం)
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – విజయసాయిరెడ్డి (పారదర్శకంగా లెక్కలు చూపడంలో ఈయన అనుభవజ్ఞులు)
ప్రిన్సిపాల్ – రోజా గారు (తిట్లలో అనేక సంవత్సరాల ప్రావీణ్యం, అనుభవం కలదు)
హెచ్ఓడీ – కొడాలి నాని (నీ అమ్మమొగుడు అనే సర్టిఫికెట్ కోర్సు హోల్డర్)
ప్రొఫెసర్ – అనిల్ యాదవ్ (బుల్లెట్లు దింపడంలో అనుభవశీలి)
డ్యాన్స్ మాస్టర్ – అంబటి రాంబాబు (నాట్యం చేయడంలో దిట్ట. మరియు అనేక మందితో నాట్యం చేసిన అనుభవం)
గెస్ట్ ఫ్యాకల్టీ – బొత్స సత్యనారాయణ (బహుభాషా కోవిదుడు. ఏ విషయం అయినా స్పష్టంగా మాట్లాడే అనుభవం ఈయన సొంతం)
పీఈటీ – పృథ్వి రాజ్ (ఏదైనా సరే వెనక నుండి ఆకర్షించడం ఈయన ప్రత్యేకత)
మ్యాథ్స్ హెడ్ – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (తప్పుడు లెక్కని కరెక్ట్ గా చెప్పడంలో ఈయన మేధస్సు అమోఘమైనది)
పరీక్ష విధానం – ప్రతిపక్ష పార్టీని తిట్టడంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులుకు మాత్రమే.. అని బుచ్చయ్య తన పోస్ట్లో రాసుకొచ్చారు.
కాగా ఈ పోస్ట్ను టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నాయి. కొందరు మీడియాలోనూ ఈ అంశంపై చర్చలు జరుపుతూ బుచ్చయ్య చూపిన వ్యంగ్యాలని వల్లెవేస్తున్నారు. దీంతో ఈ పోస్టుపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.