డిసెంబర్ తొలివారం నుంచి తనిష్ `మహాప్రస్థానం`

“జర్నీఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్“ అనే ఉపశీర్షికతో తనీష్ తన కొత్త సినిమా `మహాప్రస్థానం` ఆరంభించాడు. `అంతకుమించి`లాంటి హారర్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నజానీ ఈ సినిమాకి దర్శకుడు.
ఈ చిత్ర విశేషాలను జానీ మీడియాకు అందచేస్తూ, ఇది భావోద్వేగ ప్రేమ కథ క్రైమ్ నేపథ్యంలో హృదయానికి హత్తుకునేలా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో తనిష్ కథా నాయకుడి గా చూపే ప్రేమ, బాధ, కోపం ప్రేక్షకులను ఆకట్టుకోవ టం ఖాయమన్నారు. డిసెంబర్ తొలివారం నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించబోతున్నామని, ఏకబిగిన షూటింగ్ చేయాలని సన్నా హాలు చేసుకుంటున్నామన్నారు.