వైసీపీ కి ఆ ఒక్కడే సింహ స్వప్నం కానున్న డా?

జన సేన పార్టీ ని బీజేపీ లో విలీనం చేస్తున్నారని సాక్షి టీవీ లో ప్రసారం చేస్తోంది , నిన్న మొన్నటివరకూ పవన్ కళ్యాణ్ పేరు ను ఉచ్చరించడానికి ఇష్టపడని న్యూస్ ఛానల్ నేడు న్యూస్ బులిటెన్ లో జగన్ కార్యక్రమాల కు సంబందించిన వార్తలు పక్కన పెట్టి మరి పవన్ పై విష ప్రచారం చేస్తోంది , 151 మంది mla లను ఇచ్చిన ప్రజలు వైసీపీ కి అండగా ఉండగా కేవలం ఒక్క mla ఉన్న , రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడి ని చూసి ఎందుకు అంత బయపడి పోతున్నారు ? ప్రధాన ప్రతిపక్షం లో ఉన్న టీడీపీ విమర్శలకు స్పందించ కుండా కేవలం పవన్ కళ్యాన్ ని టార్గెట్ చేయడం లో ఆంతర్యం ఏమిటీ?
పవన్ డిల్లీ పర్యటన తరువాత అనూహ్యంగా వైసీపీ శ్రేణుల లో మారిన పరినామాలు ? అసలు వైసీపీ కి ఆ ఒక్కడే సింహ స్వప్నం కానున్నాడా ? విలీనం అని విష ప్రచారం ఎందుకు? మోడీని అభినందించిన పవన్ పై ఎందుకు ఇంత అక్కసు ? మోడీ గారికి వంగి వంగి దండాలు పెట్టినా జగన్ గారు ఆరోజు కేంద్రం మెడలు వంచు తామని ప్రగల్భాలు పలికిన నాయకులు ఇప్పుడు ఆ విషయం పక్కదోవ పట్టించడం కోసం నానా తంటాలు పడుతున్నారు.
పక్షవాతం వచ్చినా వాడికి 10 వేలు సరే, ప్రభుత్వ ఆసుపత్రి లో కుక్క కాటు వేస్తె దానికి మందు లేక ప్రయివేటు హాస్పిటల్ కి పంపుతున్నారు ఇదెక్కడి న్యాయం? ప్రజలను వర్గాలుగా , కులాలు గా విడదీసి విచ్చల విడి గా పథకాల పేరుతొ డబ్బు వెరచళ్ళుతున్నారు తప్ప అభివృద్ది కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా? విష ప్రచారాలు మాని పాలనా పై దృష్టి పెడితే బాగుంటుందని ప్రజల కోరిక …