ఎన్టీఆర్ తర్వాత వైయస్సార్కే ఆ ఇమేజ్- దిల్ రాజు

ఒకప్పుడు సినిమా ఫర్వాలేదు అని అంటే తర్వాత బావుండేది. ఇప్పుడు అలా కాదు. ఓపెనింగ్ తీసుకుంటేనే సినిమా నిలబడుతుంది. అలాంటి ఓపెనింగులు దక్కించుకునే సినిమా ఇది. రెండ్రోజుల ముందే ఎంతో ఉత్క ంఠగా ఈ సినిమా రాక కోసం వేచి చూస్తున్నా.. అన్నారు దిల్ రాజు. వైయస్సార్ జీవితకథలో పాదయాత్ర ఘట్ట ంతో రూపొందించిన యాత్ర చిత్రాన్ని దిల్ రాజు నైజాం, వైజాగ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భ ంగా హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో విలేకరులతో ముచ్చటించారు. యాత్ర చిత్రాన్ని మహి.వి.రాఘవ్ దర్శకత్వ ంలో విజయ్ చిల్లా, శశిదేవరెడ్డి నిర్మించారు.
దిల్రాజు మాట్లాడుతూ ..యాత్ర ఇంకో రెండు రోజుల్లో రిలీజవుతోంది. వై.యస్.రాజశేఖర్రెడ్డి పాదయాత్ర ఎంత సెన్సేషనల్ అయిందో తెలుగు ప్రేక్షకుల్లో అందరికీ తెలుసు. దాన్ని ఐడియాగా తీసుకుని పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్, మూమెంట్స్ ని తీసుకుని మహి కథ రాశారు. దాన్ని విజయ్ నిర్మించారు మమ్మట్టిలాంటి లెజండరీ యాక్టర్ యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టీజర్ విడుదలైనప్పుడు, పాటలు విడుదలైనప్పుడు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఎగ్జయిట్మెంట్ కనిపించింది. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్… మంచి సినిమా రాబోతోందని అనిపిస్తుంది. ఇంకా రెండు రోజులు ఉండగానే ఓవర్సీస్లోగానీ, ఏపీ, తెలంగాణలోనూ ఆన్లైన్ బుకింగ్స్ బావున్నాయి. వెరీ స్ట్రాంగ్ ఓపెనింగ్ తీసుకోబోతుంది సినిమా. ఇవాళ ఓపెనింగ్ తీసుకుంటేనే ఆ సినిమాకు ఒక రెవెన్యూ మేజిక్ జరుగుతుంది. ఓపెనింగ్ అనేది ఇప్పట్లో మరింత ఇంపార్టెంట్ అయింది. ఈ సినిమాను నైజామ్, వైజాగ్లో మా సంస్థ విడుదల చేస్తోంది. అందువల్ల రాజశేఖర్రెడ్డిగారి పాదయాత్రలో జరిగిన మూవ్మెంట్స్ ఆ రోజుల్లో పేపర్లో, టీవీల్లో చూడటమే. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి హీరో అయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మ్ అయింది. జనాల కోసం ఏదైనా చేస్తాడు ఓ నాయకుడు అని రాజశేఖర్రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుని చూపించారు. రామారావుగారి తర్వాత మన రాష్ట్రాల్లో ఒక ఇమేజ్ బిల్డ్ అయింది రాజశేఖర్రెడ్డిగారికి. అలాంటి గొప్ప వ్యక్తి ఇతివృత్తంతో వస్తున్న యాత్ర పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ .. ఏడాదిన్నరగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నాం. ఫిబ్రవరి 8న సినిమా విడుదల కానుంది. మేం చేయాల్సిందంతా చేశాం. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా రాజశేఖర్రెడ్డిగారి పొలిటికల్ జీవితానికి సంబంధించింది కాదు. ఇది పొలిటికల్ చిత్రం కాదు. ఇందులో కాంట్రవర్సీలు లేవు. రాజశేఖర్రెడ్డిగారి వ్యక్తిత్వం, స్ఫూర్తికి సంబంధించింది. సినిమా నచ్చితే అందరికీ చెప్పండి. ఇది రాజశేఖర్రెడ్డిగారి ఫ్యాన్స్ కి మాత్రమే కాదు. ఏ సినిమా లవర్ అయినా సినిమాను ఆస్వాదించేలా తెరకెక్కించాం“ అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ మనకి అభిప్రాయభేదాలు ఉండవచ్చు. ఎవరి ఆలోచనలు వారివై ఉండవచ్చు. అంతమాత్రాన ఎవరినీ అగౌరవపరచకూడదు. ఎవరినీ అసహ్యించుకోకూడదు. వైయస్సార్ సినిమా చేస్తున్నాం. ఈ విషయం అందరికీ ఇష్టం ఉండొచ్చు. ఇష్టం లేకపోవచ్చు. అంత మాత్రాన దయచేసి అగౌరవపరచవద్దు. సినిమా బాగా వచ్చింది. ఈ చిత్రం చూడటానికి ప్రేక్షకులు ఎంత క్యూరియస్గా ఉన్నారో, నేను కూడా అంతే ఆత్రుతగా వెయిట్ చేస్తున్నా అని అన్నారు