నేటి నుంచే ప్రయాణీకులకు రైల్వే చార్జీల వడ్డింపు
ఇండియన్ రైల్వేస్ ఛార్జీలను స్వల్పంగా పెంచుతున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు ఈ రోజు రాత్రి నుంచే అమలులోకి వస్తాయని రైల్వే శాఖ ప్రకటించింది. దీనికి తోడు అదనంగా జిఎస్టీ బాదుడు కూడా తోడు కానుంది. రైల్వే మంత్రిత్వ శాఖ సర్క్యులర్ మేరకు నేటి నుంచి అంటే జనవరి 1, 2020 నుండి, ఎసి టికెట్పై కిలోమీటరుకు అదనంగా 4 పైసలు, సాధారణ ఎసియేతర రైళ్లపై కిలోమీటరుకు అదనంగా 1 పైసా, నాన్-ఎసి ఎక్స్ప్రెస్ రైళ్లపై 2 పైసలు వసూలు చేయబడతాయి.
సవరించిన ఛార్జీల నుండి సబర్బన్ రైళ్లను మినహాయించింది. ప్రీమియం రైళ్లు శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లను ఛార్జీల పెంపులో చేర్చారు. రిజర్వేషన్ ఫీజు, సూపర్ఫాస్ట్ సర్చార్జీలలో ఎటువంటి మార్పు లేదు. అయితే ఎప్పటికప్పుడు సూచనల ప్రకారం వస్తు సేవల పన్ను (జిఎస్టి) విధించబడుతుంది. అలాగే రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం. తన భద్రతా దళం ఆర్పిఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్)కు ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ అని పేరు పెట్టారు. వీటి నిర్వహణ కోసమే ఈ టిక్కెట్ ధరల పెరుగుదలగా కనిపిస్తోంది.