వెంకట్రామ్ పల్లా దర్శకత్వంలో ‘ నీకై అభిసారికనై` చిత్రం ప్రారంభం!!

అనీషా క్రియేషన్స్ పతాకంపై బాలాజీ సమర్పణలో సుగుణ.ఒ నిర్మాతగా సాయిబాబు, ఆషీరాయ్, సురయ పర్వీన్ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న చిత్రం ‘ నీకై అభిసారికనై’. సీనియర్ ఎడిటర్ వెంకట్రామ్ పల్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశం చిత్రీకరణతో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి సంధ్యా మోషన్ పిక్చర్స్ ఎండి శ్రీ రవి కనకాల క్లాప్ నివ్వగా ప్రముఖ దర్శక నిర్మాత మద్ది నేని రమేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్రామ్ పల్లా మాట్లాడుతూ – “ఈరోజు మా సినిమా ప్రారంభోత్సవం జరగడం హ్యాపీ గా ఉంది. అందరూ కొత్త వారితో ఈ సినిమా చేస్తున్నాము. ఏకధాటిగా 15రోజుల పాటు మొయినాబాద్ పరిసర ప్రాతాలలో షూటింగ్ జరుపనున్నాం. రాజ్ కిరణ్ సంగీత సారథ్యంలో ఇప్పటికే 5పాటల రికార్డింగ్ పూర్తయ్యింది” అన్నారు.