ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ……… దిశ ఆత్మకు శాంతి …….. తల్లిదండ్రులకు సంతోషం…

హైదరాబాద్లో జరిగిన వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ హత్యాచారం కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా నిలిచింది. అంత్యంత కిరాతకంగా.. ఆమెను అత్యాచారం చేసి.. హత్య చేసిన వైనం… మనసున్న ప్రతీ మానవుడిని కలిచివేసింది. ఈ హత్యపై అటు రాజకీయ నాయకులు.. ఇటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. అంతేకాకుండా.. గత కొద్ది రోజులుగా.. ఈ నలుగురు నిందితులను ఉరి తీయాలని.. ప్రజలందరూ పెద్ద ఎత్తున.. నిరసనలు, ర్యాలీలు చేసిన విషయం తెలిసిందే…
అయితే సీన్ రికన్స్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో … చేసేది ఏంలేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు… ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు….
దిశ కు ఇపుడు న్యాయం జరిగింది, ఇపుడు దిశ ఆత్మకు శాంతి కలుగుతుంది అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు….