సెన్సార్ చేయకుంటే ఆ సినిమాకి సీక్వెల్ చేస్తానంటున్న వర్మ

29న విడుదల కావాల్సినవర్మ తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీ టైటిల్ ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చినా నేటికీ సెన్సార్ పూర్తి కాకపోవటంపై మండి పడుతున్నాడు వర్మ.
ఈ నెల 29న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. హైకోర్ట్ బ్రేక్ వేయడంతో ఆగిపోవటం ఓ ఎత్తయితే ఈ సినిమాపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేయడం.. ఇంకా సెన్సార్ చేసి, సర్టిఫికేట్ ఇవ్వక పోవటం వెనుక ఏదో జరుగుతోందని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఏ కులాన్ని తక్కువ చేసి చూపించాల్సిన అవసరం తనకు లేదు కానీ సెన్సార్ ఉద్దేశ పూర్వకంగానే అన్నిరకాల రూల్స్ ని నాపైనే రుద్దుతోందంటూ మండి పడ్డారు.
మనం ఓటు వేసి ఎన్నుకునే నాయకుల వ్యవహానాలు ఏ సినిమా చూడాలో ఏం సినిమా చూడకూడదో.. జనాలకు బాగా తెలుసని తను ఏ ఒక్క పార్టీ కోసమో.. వ్యక్తి కోసమో ఈ సినిమా తీయలేదని, తన మనసులో మెదిలిన సెటైర్ ని కథగా మలుచుకుని మాత్రమే తీశానని అన్నారు. ఇండస్ట్రీలో తను పడి లేచే కెరటాన్నిఅని అంటూ మీరు ఎంత అణగదొక్కాలని అనుకుంటే అంత పైకి లేస్తానంటూ హెచ్చరించారు. ముగ్గురు సెన్సార్ వాళ్లు తన చిత్రాన్ని ఆపేస్తున్నారని, ఇక్కడితో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీ ఆగదని, దీనికి సీక్వెల్ తీస్తానని శపథం చేసారు వర్మ మీడియా ముందు.
ఈ విషయంపై ఆలయ అధికారులను అడిగితే అబ్బే… అలాంటిందేం లేదని, నిబంధనల మేరకే టిటిడి సభ్యునికి అనుమతినిచ్చామని, పైగా ఇది వ్యక్తిగత హోమం కాదని చెప్పారు. ఇది సమస్త మానవాళి సంక్షేమం కోసం తలపెట్టిన హోమం అని కూడా అధికారులు చెబుతున్నారు. యాగ స్థలంలోకి ఇతరుల ప్రవేశాన్ని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నిస్తే… అలాంటిదేం లేదని, తాము ఎవరినీ అడ్డుకోలేదని అధికారులు అంటున్నారు. అయితే భక్తులను అడ్డుకున్న దెవరన్న విషయమై పదే పదే ప్రశ్నించినా తప్పించుకు తిరగటం ఆరంభించారు.