కరోనా వల్ల శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలు వాయిదా

ప్రతి యేటా తన జన్మదినోత్సవంతో పాటు తిరుపతి లోని శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవాన్ని మార్చి 19వ తేదీన జరిపే మోహన్ బాబు తాజాగా ఈ వేడుకలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు తీవ్రం అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఈ వేడుకలను వాయిదా వేసుకున్నట్టు చెప్పారు.
కరోనా వైరస్ భయాందోళనలతో జనం భయపడుతున్నారని, ఎక్కడా గుంపులుగుంపులుగా ఉండడం మంచిది కాదని కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను గుర్తు చేస్తూ, పుట్టిన రోజుని పురస్కరించుకుని తనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడానికి ఎవరూ రావొద్దని సూచించారు మోహన్బాబు.
కరోనా వైరస్ భయాందోళనలతో జనం భయపడుతున్నారని, ఎక్కడా గుంపులుగుంపులుగా ఉండడం మంచిది కాదని కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను గుర్తు చేస్తూ, పుట్టిన రోజుని పురస్కరించుకుని తనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడానికి ఎవరూ రావొద్దని సూచించారు మోహన్బాబు.