శ్రీవారి సేవలో రోజా

తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు రోజా. ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మూడు రాజధానులను వ్యతిరేకిస్తోన్న చంద్రబాబును రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు తరిమికొట్టాలని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలు నిజాయితీగా ఓటు వేసి మా జగన్ గారిని గెలిపించారని ఆమె అన్నారు..
అయితే,.. మంగళగిరి మాత్రం ప్రజలు చైతన్యవంతులు.. అందుకే అక్కడ చంద్రబాబు కుమారుడు..నారా లోకేశ్ను మంగళగిరిలో ఓడించారని ఆమె చెప్పారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేయడం సిగ్గుమాలిన చర్యని ఆమె అన్నారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసం పనిచేస్తున్నారని, ఏపీ సీఎం జగన్ మాత్రం ఏపీ అభివృద్ధికి కోసం పనిచేస్తున్నారని ఆమె అన్నారు.