మన్మధుడు సరసన పాయల్


టాలీవుడ్ చిత్రం మన్మథుడు అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాకు రీమేక్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆరెక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్
పుత్ హీరోయిన్గా నటించనుందని టాక్ వినిపిస్తోంది. నాగార్జున కెరీర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో మన్మథుడుకు ప్రత్యేక స్థానముంది. ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది.
ఇందులో నాగార్జున హీరోగా.. సొంత బ్యానర్లో సినిమా రూపుదిద్దుకుంటోంది. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. అందులో ఒకరు ఆరెక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్పుత్ను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఆరెఎక్స్ 100 సినిమాతో పాయల్ యూత్కి బాగా కనెక్ట్ అయిన నేపథ్యంలో మన్మథుడు2కి ఆమె బాగా యాప్ట్ అవుతుందని సినీ జనం అంటున్నారు. ఇక నాగ్ సరసన నటించే మరో హీరోయిన్ ఎవరనేదాని పై ప్రస్తుతం వాడీవేడీగా చర్చ సాగుతోంది.